IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) ఆలౌటయ్యింది. మూడో రోజు తొలి సెషన్లో పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్(Joe Root) విజృంభణతో టీమిండియా 436 పరుగులకే కుప్పకూలింది. దాంతో, రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. తొలుత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(87: 180 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)ను ఎల్బీగా వెనక్కి పంపిన రూట్.. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా(0)ను బౌల్డ్ చేశాడు.
హ్యాట్రిక్ బంతిని సిరాజ్ అడ్డుకున్నాడు. కానీ, తర్వాతి ఓవర్లో రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్(44) బౌల్డ్ అయ్యాడు. దాంతో, టీమిండియా ఓవర్నైట్ స్కోర్కు మరో 35 పరుగులు మాత్రమే జోడించగలిగింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 246కే కట్టడి చేసిన భారత బౌలర్లు .. రెండో ఇన్నింగ్స్లో అదే పని చేయాలనుకుంటున్నారు.
Jadeja (87), KL Rahul (86) and Jaiswal (80) with key contributions as India take a big lead in Hyderabad #INDvENG
▶️ https://t.co/WzuwYpQAGX pic.twitter.com/4D6vAplNFH
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2024
అశ్విన్, జడేజా చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు 236 రన్స్కే ఆలౌటయ్యింది. కెప్టెన్ బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86 : 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా ( 87) హాఫ్ సెంచరీలు బాదడంతో భారీ స్కోర్ చేసింది.