మహబూబాబాద్ రూరల్/బయ్యారం/కురవి/ వాజేడు/ ఏటూరునాగారం/ మంగపేట/పలిమెల, ఏప్రిల్ 6 : మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలు మండలాల్లో సోమ వారం రాత్రి, మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇండ్లపై కప్పులు లేచిపోవడంతోపాటు రహదారుల వెంట ఉన్న కరంటు స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మహబూబాబాద్ పట్టణంలో బలమైన ఈదురు గాలులు వీచాయి. నడివాడ, గడ్డిగూడెంలో 16 ఇండ్ల పైకప్పు లు లేచిపోయాయి. నడివాడలో ఏడు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడ్డాయి. మామిడి తోటల్లో చెట్లు విరగడంతోపాటు కాయలు నేలరాలా యి. బయ్యారం మండలంలోని బాల్యతండా, వెంకట్రాంపురం, బండ్లకుంట, బాలాజీపేట, కస్తూరినగర్, బయ్యారం గ్రామాల్లో ఈదురు గాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజ్), బంచరాయితండా, తాట్యాతండా, బంగారిగూడెం, కొత్తూరు(ఈ) తదితర గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.
కురవి, తట్టుపల్లి, గుండ్రాతిమడుగు, రాజోలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ములుగు జిల్లా వాజేడు మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. కల్లాలో ఆరబోసిన మిర్చిరాశులు తడువకుండా రైతులు టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఏటూరునాగారం మండలంలో ఈదురు గాలులతో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిపంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. మంగపేట మండలంలోని కమలాపురం, బోరునర్సాపురం, మల్లూరు, తిమ్మంపేట, రాజుపేట గ్రామాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. జయశంకర్ జిల్లా పలిమెల మండలంలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభ త్సం సృష్టించింది. దాదాపు రెండు గంటలపాటు రాళ్లవాన కురిసింది. సర్వాయిపేటలో ఏడు కరంటు స్తంభా లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మోదే డులో మక్కజొన్న పూర్తిగా నేలవాలిం ది. పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయి. పలిమెల, పంకెన, లెంకలగడ్డ గ్రామా ల్లో కల్లాలో ఆరబెట్టిన మిర్చి తడిసిముద్దయింది.
ఇవి కూడా చదవండి..
నాన్నను విడిచిపెట్టండి.. మావోలను కోరిన కమాండో కుమార్తె