IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉన్న భారత జట్టు విశాఖపట్టణంలో గర్జించింది. గురువారం భారీ స్కోర్లు నమోదైన మయాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా 2 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. తొలిసారి టీ20ల్లో సారథ్యం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (80 : 41 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(58 : 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టును గెలుపు వాకిట నిలిపారు. ఆ తర్వాత రింకూ సింగ్(28 నాటౌట్) తోకతో కలిసి లాంచనం పూర్తి చేశాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
కొండంత లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఉతికారేశారు. అయితే.. అబాట్ వేసిన ఆఖరి ఓవర్లో 7 పరుగులు అవసరమవ్వగా.. రింకూ తొలి బంతికి బౌండరీ బాదాడు. ఇక గెలుపు పూర్తయినట్టే అనుకున్న సమయంలో అక్షర్ పటేల్, బిష్ణోయ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో అర్ష్దీప్ రనౌటయ్యాడు. అప్పటికీ స్కోర్లు సమం అయ్యాయి. ఇక చివరిబంతికి సిక్సర్తో రింకూ మ్యాచ్ ముగించాడు.
Rinku Singh ices the last ball with a SIX – but it’s off a no ball and doesn’t go into the scorecard!
In any case, India chase down their highest in T20Is 🔥#INDvAUS
LIVE: https://t.co/GTiGD3faCl pic.twitter.com/cJnoK1hDrD
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2023
208 పరుగుల ఛేదనలో యశస్వీ జైస్వాల్(21) శుభారంభం ఇవ్వడంతో.. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(58 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు) రెచ్చిపోయ ఆడాడు. సూపర్ హాఫ్ సెంచరీతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (80 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సియాన్ అబాట్ ఓవర్లో భారీ సిక్సర్తో సూర్య ఫిఫ్టీ సాధించాడు. 25 రన్స్కే 2 వికెట్లు పడిన సమయంలో ఇషాన్తో సూర్య మూడో వికెట్కు133 పరుగులు జోడించాడు. ఇషాన్ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(12) నిరాశపరిచినా.. సూర్య, రింకూ పట్టువదలక పోరాడి భారత్ను గెలిపించారు.
5⃣8⃣ Runs
3⃣9⃣ Balls
2⃣ Fours
5⃣ Sixes@ishankishan51 departs but not before he scored a breezy & stroke-filled half-century in the chase!Follow the match ▶️ https://t.co/T64UnGxiJU #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/G7gRcvR1P9
— BCCI (@BCCI) November 23, 2023
జోష్ ఇంగ్లిస్(110 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టీవ్ స్మిత్ (52) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి దంచుడే పనిగా పెట్టుకున్న కంగారూ ఆటగాళ్లు 19వ ఓవర్ దాకా అదే జోరు కొనసాగించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్(19 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 200 దాటించాడు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా ఆసీస్ పరుగుల ప్రవాహానికి తోడైంది.