Gold Rates | అంతర్జాతీయ బలహీనతల పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర గురువారం స్వల్పంగా రూ.30 తగ్గి రూ.62,170 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది. మరోవైపు, కిలో వెండి ధర వరుసగా రెండో సెషన్లో రూ.76,400 వద్ద కొనసాగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1994 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.66 డాలర్లు పలికింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం యధాతథంగా కొనసాగుతున్నదని డేటా తెలిపింది. దీంతో అమెరికా ట్రేజరీ బాండ్లు పుంజుకున్నాయి. వచ్చేవారం ద్రవ్య పరపతి సమీక్షపై అందరూ ఫోకస్ చేస్తున్నారు.
మరోవైపు, ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ కాంట్రాక్ట్ తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.48 పెరిగి రూ.61,072 వద్దకు పెరిగింది. డిసెంబర్ కిలో వెండి ధర రూ.114 పుంజుకుని రూ.72,940 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.96 లబ్ధితో రూ.61, 120 వద్ద నిలిచింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.15 శాతం పుంజుకుని 2016.20 డాలర్లు పలికింది.