మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్
ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తెలిపారు. మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించట్లేదని, ఐపీఎల్లో పాల్గొనే వారు ఐసొలేషన్ ప్రాంతం (బయోబబుల్) నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని చెప్పినట్టు ఆయన వెల్లడించారు. అలాగే రాత్రి కర్ఫ్యూ ఉన్నా వాంఖడేలో రాత్రి 8 గంటల తర్వాత జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు, హోటళ్లకు చేరుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 10 నుంచి 25 మధ్య వాంఖడే స్టేడియం 10 ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ రెండో రోజైన 10న ఢిల్లీ, చెన్నై మధ్య తొలి మ్యాచ్ ఇక్కడ జరుగాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా స్పష్టం చేశాడు.
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్గా మాజీ డీజీపీ