న్యూఢిల్లీ: ఐపీఎల్కు ముందు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాని(ఏసీయూ)కి కొత్త చీఫ్ వచ్చారు. గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుసేన్ షేఖదమ్ కండ్వావాలా ఏసీయూ హెడ్గా నియమితులయ్యారు. 1973 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కండ్వావాలా 2010లో గుజరాత్ డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత లోక్పాల్ సెర్చ్ కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. కాగా దేశంలో బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తే మ్యాచ్ ఫిక్సింగ్కు అవకాశం పెరుగుతుందని షబ్బీర్ అభిప్రాయపడ్డారు. అందుకే బెట్టింగ్కు అనుమతులు ఇవ్వకూడదని అన్నారు.
మరిన్ని వార్తలు చదవండి..