మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల 28 నుంచి మే 4 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వ్యాపార, వాణిజ్య సముదాయల ప్రతినిధులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణ య ం తీసుకున్నారు. అత్యవసర సేవలైన దవాఖానలు, మెడికల్ మినహా అన్ని రకాల వ్యాపార, వాణిజ్య దుకాణాలతో పాటు మద్యం దుకాణాలు, టిఫిన్సెంటర్లు, మాంసం, చికెన్ సెంటర్లు, పాల కేంద్రాలు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చంద్రపాల్ తెలిపారు. దుకాణాలు తెరిస్తే కొవిడ్ నిబంధనల ప్రకారం సీజ్ చేసి జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు సైతం అవసరమైతేనే ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే మాస్క్ ధరించి బయటకి రావాలన్నారు. ఈ సమా వేశంలో పాలకవర్గ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.