INDvsSA 2nd Test: దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విజృంభణతో సఫారీలు తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ప్రొటీస్ ఇన్నింగ్స్లో 9 ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్.. మూడు మెయిడిన్లు చేసి 15 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తీసిన వికెట్లలో సఫారీ పేస్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ కూడా ఒకరు. ఈ వికెట్ తీయడానికి సిరాజ్.. కోహ్లీ ప్లాన్ను పక్కాగా అమలుచేసి సక్సెస్ అయ్యాడు.
వివరాల్లోకెళ్తే సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా 16వ ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి బెడింగ్హామ్ను ఔట్ చేశాడు. అప్పుడు జాన్సెన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. జాన్సెన్ రాగానే ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ఔట్ సైడ్ ఆఫ్ వికెట్ దిశగా బంతిని సంధించాలని తద్వారా బాల్.. బ్యాట్కు తాకి కీపర్కు క్యాచ్ ఇస్తాడని సిరాజ్కు సైగల ద్వారానే చెప్పేశాడు.
The video you’re looking for pic.twitter.com/Fu9PTiYmeU
— ẞ (@PackedBishh) January 3, 2024
తన మాజీ సారథి చెప్పిన ప్లాన్ను సిరాజ్ పక్కాగా అమలుచేశాడు. 16వ ఓవర్లో ఐదో బంతిని ఆఫ్ సైడ్కు ఆవలగా సంధించాడు. జాన్సెన్ బంతిని డిఫెండ్ చేయబోయాడు కానీ అది కాస్తా బ్యాట్ ఎడ్జ్కు తాకుతూ వికెట్ కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. అంతే టీమిండియాలో సంబురాలు. జాన్సెన్ వికెట్ సిరాజ్ ఖాతాలో ఐదోవది కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.