అమరావతి : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న మోదీ ప్రచారంలో రోడ్ షో ( Road Shows) లతో పాటు పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.
ఈ నెల 7,8 వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించ నున్నారు. 7వ తేదీన వేమగిరిలో రాజమహేంద్రవరం (Rajamahendravaram) లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తరుఫున బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం అనకాపల్లిలోని రాజుపాలెం సభలో మోదీ పాల్గొననున్నారు. 8న పీలేరు సభలో పాల్గొని రాత్రి విజయవాడలోని ఇందిరా స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగే రోడ్షోలో మోదీ పాల్గొంటారని ఏపీ బీజేపీ శాఖ ప్రకటించింది.