Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయకుండా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తోందని సమాజ్వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని బదౌన్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఎన్డీయే హయాంలో దేశవ్యాప్తంగా లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రైతుల కోసం పనిచేస్తోందా లేక పెట్టుబడిదారుల కొమ్ము కాస్తోందా తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ఈ దిశగా విపక్ష ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నదని అఖిలేష్ యాదవ్ వివరించారు.
యూపీలో ఇప్పటివరకూ 10 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఇప్పటివరకూ ఈసారి 400 స్దానాలు సాధిస్తామని ఊదరగొట్టగా ఇప్పుడు 400 స్ధానాల్లో ఓటమి తప్పదనే మాటలు కాషాయ పార్టీ నేతలకు వినిపిస్తున్నాయని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.
Read More :
Vande Metro | వందే భారత్ మెట్రో ఏపీకే..! తిరుపతి-చెన్నై మధ్య కూతపెట్టనున్న రైలు..!