ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లా కాంగ్రెస్ పార్టీలో(Congress Party) అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మొన్నటి భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి ఘటన మరవక ముందే మరోసారి ఆ పార్టీలో వర్గ విభేదాలు( Clashes) బయటపడ్డాయి. తాజాగా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రచారంలో సుబ్లేడ్ గ్రామానికి చెందిన రామసహాయం నరేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కాగా, నరేష్ రెడ్డి మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని బీరోలు గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అనుచరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Ponguleti Srinivas Reddy) చెప్పారు. నరేష్ రెడ్డి ప్రసంగిస్తే మండలంలో ఓట్లు పడవని, అతన్ని దూరం పెట్టాలని చెప్పడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మంత్రి సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపొరు.. ఇరువర్గాల మధ్య తోపులాట
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రచారంలో సుబ్లేడ్ గ్రామానికి చెందిన రామ సహాయం… pic.twitter.com/C8QDyjyQm7
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024