Paris Olympics 2024 : అథ్లెటిక్స్లో భారత్ ఖాతాలో మరో ఒలింపిక్స్ బెర్తు చేరింది. యువ వాకర్ రామ్ బబూ(Ram Baboo) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు దక్కించుకున్నాడు. స్లోవేకియాలో జరిగిన 20 కిలోమీటర్ల రేసు క్వాలిఫికేషన్లో రామ్ అత్యుతమ టైమింగ్ నమోదు చేశాడు. అతడు 1:20:00 సమయంలో ఫినిషింగ్ లైన్ చేరుకొని విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. ఈ పోటీలో పెరూకు చెందిన సీజర్ రోడ్రిగ్స్, ఈక్వెడార్ అథ్లెట్ బ్రియాన్ పింటాడోలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఇక మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి.. ఒక్కరే క్వాడ్రెన్నియల్ ఎక్స్ట్రావగంజాలో క్వాలిఫై అయింది. అయితే.. వ్యక్తిగత ట్రాక్ పోటీలకు ముగ్గురిని మాత్రమే ఒలింపిక్స్కు పంపాల్సి ఉంటుంది. దాంతో, ఎవరిని ఎంపిక చేయాలనేది భారత అథ్లెటిక్ సమాఖ్య(AFI) నిర్ణయించనుంది. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్ల తుది జాబితాను జూన్లో ప్రకటిస్తామని చీఫ్ అథ్లెటిక్స్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వెల్లడించాడు.
What a day for Peru 🇵🇪
Cesar Rodriguez and Evelyn Inga claim Peruvian double at the Dudinska 50.
— World Athletics (@WorldAthletics) March 16, 2024
పేద కుటుంబానికి చెందిన రామ్ చైనాలో నిరుడు జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకంతో మెరిశాడు. 35 కిలోమీటర్ల నడకలో 1:20:10 టైమింగ్తో మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించాడు. ఈ పోటీల్లో పతకం గెలిచిన మొదటి ఒక భారత అథ్లెట్గా రామ్ చరిత్ర సృష్టించాడు. మొదట్లో మారథాన్ రన్నర్ అయిన రామ్ 10 వేల, 5వేల పరుగుల పాల్గొన్నాడు. అయితే.. కాళ్ల నొప్పుల కారణంగా స్థానిక కోచ్ ప్రమోద్ యాదవ్ సలహాతో వాకర్గా మారాడు.