హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (MP Ranjith Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేవెళ్ల ప్రజలకు సేవచేసే అవకాశాలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తొలుత చేవెళ్ల స్థానాన్ని ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ కేటాయించింది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆయన తాను పోటీలో ఉండలేనని పార్టీ అధిష్ఠానానికి చెప్పడంతో.. కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో నిలిపింది.