PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) మళ్లీ కోర్డులో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఆమె ప్రతిష్ఠాత్మక ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ (Asian Team Championship)లో బరిలోకి దిగనుంది. మలేషియాలో ఫిబ్రవరి 13 నుంచి జరిగే ఈ టోర్నీకోసం మంగళవారం భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.
థామస్ కప్(2022) విజేతలు, ఆసియా గేమ్స్(2023)లో వెండి పతకం సాధించిన షట్లర్లను ఎంపిక చేసింది. మహిళల విభాగానికి సింధు నేతృత్వం వహించనుండగా.. పురుషుల బృందాన్ని స్టార్ ఆటగాళ్లు హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)లు నడిపించనున్నారు.
HERE WE GO 😎
Presenting 🇮🇳 squad for the upcoming #BATC2024 🙌#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/NhAGWQhJFZ
— BAI Media (@BAI_Media) January 9, 2024
పురుషుల జట్టు : హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ద్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోవలా, పృథ్వి రాయ్.
మహిళల జట్టు : పీవీ సింధు, అన్మోల్ ఖార్బ్, తన్వీ శర్మ, అష్మిత చల్హిత, త్రెస్సా జాలీ, గాయత్రి గోపిచంద్, అశ్వినీ పొన్నప్ప, తనీష క్రాస్టో, ప్రియా దేవీ కొంజెంబమ్, శ్రుతి మిశ్రా.
ఈ టోర్నీలో టీమ్ ఈవెంట్ భారత్కు కీలకం కానుంది. ఎందుకంటే..? ఫైనల్కు చేరితే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తుకు అవసరమైన పాయింట్లు దక్కుతాయి. అందుకని షట్లర్లు టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్పై దృష్టి పెట్టనున్నారు.