WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవలే ఎన్నికైన సంజయ్ సింగ్ ప్యానెల్ను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆధ్వర్యంలో ‘అడ్ హక్ కమిటీ’ని ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఐవోఏ.. ముగ్గురు సభ్యులతో కూడిన అడ్ హక్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి భూపిందర్ సింగ్ బజ్వా చైర్మన్గా వ్యవహరించనున్నారు. భూపీందర్ సింగ్ గతంలో కూడా డబ్ల్యూఎఫ్ఐ అడ్ హక్ కమిటీకి చీఫ్గా పనిచేశారు.
ఐవోఏ నియమించిన కమిటీలో భూపీందర్ సింగ్ బజ్వాతో పాటు ఎంఎం సౌమ్య, మంజూష కన్వర్లు ఉన్నారు. మళ్లీ కొత్త పాలకవర్గం వచ్చేదాకా డబ్ల్యూఎఫ్ఐలో అడ్హక్ కమిటీయే దైనందిన వ్యవహారాలను చూసుకుంటుంది. ఈ ఏడాది యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) .. డబ్ల్యూఎఫ్ఐలో నిర్దేశిత కాలంలో ఎన్నికలు నిర్వహించనందున భారత రెజ్లింగ్ సంఘంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రీడా మంత్రిత్వ శాఖ.. అడ్ హక్ కమిటీని నియమించగా ఆ కమిటీలో కూడా భూపీందర్ ఉన్నారు.
మూడు రోజుల క్రితమే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ను రద్దు చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషాను అడ్హక్ కమిటీ చైర్మన్గా ఉండాలని కోరినా ఆమె మాత్రం విముఖత వ్యక్తం చేశారు.
Bhupinder Singh Bajwa named chairman of ad hoc panel that will run day to day affairs #WrestlingFederationofIndia. The IOA-appointed panel also consists of MM Somaya & Manjusha Kanwar.#WFI #IOA
— Tridib Baparnash ॐ (@TridibIANS) December 27, 2023