బ్రిస్బేన్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ను రద్దు చేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్న కారణం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియాన తన తొలి వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు కివీస్ జట్టు తొలి మ్యాచ్లో ఓడిపోగా.. రెండవ మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ను రద్దు చేశారు.
Match at The Gabba has been called off due to persistent rains. pic.twitter.com/pWSOSNBWz1
— BCCI (@BCCI) October 19, 2022
ఇక వరల్డ్కప్లో భారత్ తన తొలి మ్యాచ్ను ఆదివారం ఆడనున్నది. దాయాది పాకిస్థాన్తో ఆ మ్యాచ్లో ఇండియా తలపడుతుంది. ఆ హై టెన్షన్ మ్యాచ్ కోసం భారత్ ప్రిపేరైంది.