Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. కిత్రం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,973.30 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ 74వేల మార్క్ను దాటింది. కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ప్రారంభంలో 74,026.80 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో సెన్సెక్స్.. 73,259.26 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
చివరకు 383.69 పాయింట్లు తగ్గి.. 73,511.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.20 తగ్గి 22,302.50 వద్ద స్థిరపడింది. దాదాపు 1,096 షేర్లు పెరగ్గా.. 2,727 పతనమయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2శాతం, నిఫ్టీ ఐటీ 0.77శాతం పెరిగాయి. ప్రతికూలతతో నిఫ్టీ రియాల్టీ 3.5శాతం, మెటల్స్ వరుసగా 2.4శాతం పతనమయ్యాయి. నిఫ్టీ సీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.3శాతం, నిఫ్టీ హెల్త్కేర్ 2శాతం, నిఫ్టీ ఆటో 1.8శాతం తగ్గాయి. నిఫ్టీలో హెచ్యూఎల్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, నెస్లే, టీసీఎస్ లాభాల్లో ముగియగా.. బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్సీజీ, ఇండస్ఇండ్, హిందాల్కో నష్టపోయాయి.