అమరావతి : ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా (Mukesh Kumar Meena) వెల్లడించారు. కొంతకాలం తరువాత ఇవ్వాలని ఆదేశించిందని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో పోస్టల్ బ్యాట్(Postal Ballot) కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.30 లక్షల మంది ఓటు హక్కును సద్వినియోగ పరుచుకున్నారని ఆయన వివరించారు.పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) పోలింగ్ను దాదాపు 70 శాతం పూర్తికాగా అవసరమైతే 9వ తేదీ వరకు పొడిగిస్తామని తెలిపారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కోసం20 రోజుల సమయాన్ని ఇచ్చామని, గడువు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు. కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు మాత్రమే కోరిందన్నారు. నాయకులకు సెక్యూరిటీ ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని ఆయన తెలిపారు.