ఓవల్ : నాలుగవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా 28 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో అతను కీపర్కు క్యాచ్ ఇచ్చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నది. నిజానికి ఇండియన్ ఓపెనర్లు నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం క్రీజ్లో రాహుల్, పుజారాలు ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులోకి పోప్, వోక్స్ వచ్చారు. బెయిర్స్టో కీపింగ్ చేస్తున్నాడు. భారత జట్టులోకి యాదవ్, థాకూర్లు వచ్చారు. ఇశాంత్, షమీని తప్పించారు.