చండీగఢ్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఒలింపిక్స్లో నీరజ్ అద్భుత ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆనందంతో డ్యాన్స్ చేశారు.
కాగా, ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో వందేండ్ల తర్వాత భారత్కు తొలి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రసంశలు వెల్లివెరిశాయి. హర్యానాలోని పానిపట్కు చెందిన ఆయనకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ రూ.6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.
మరోవైపు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంపై ఆయన సోంతూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా సంబరాలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలను ఊపుతూ, డప్పులు వాయిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు.