కాండీ: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ హై వోల్టేజ్ గేమ్. ఆ ఇక థ్రిల్లింగ్ ఆట కన్నా ముందు.. ఇరు జట్ల ఆటగాళ్లు కాస్త సేద తీరారు. ఆసియాకప్(Asia Cup 2023)లో ఇవాళ తలపడనున్న ఆ ఇరు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ సమయంలో మాట్లాడుకున్నారు. ఉత్కంఠ రేపే ఆ పోరుకు ముందు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ మరికొంత మంది ప్లేయర్లు పాక్ క్రికెటర్లతో చిట్చాట్ చేశారు. పాక్ బౌలర్ హరీశ్ రౌఫ్తో విరాట్ కోహ్లీ మాట్లాడారు. మరో స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్లను కూడా డ్రెస్సింగ్ రూమ్లో కలుసుకున్నాడు విరాట్. ఇండోపాక్ కెప్టెన్లు రోహిత్, బాబర్ ఆజమ్లు కూడా బ్యాటింగ్ నెట్స్ వద్ద ఒకర్ని ఒకరు పలుకరించుకున్నారు.
India 🤝 Pakistan players meet-up during practice session.
Kohli & Rauf, Rohit & Babar, Siraj & Rauf and many more – lovely moments. pic.twitter.com/P01wJOIUHA
— Johns. (@CricCrazyJohns) September 1, 2023