ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పగ నెగ్గాల్సిన మ్యాచ్లో భారత జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. మిడిలార్డర్ వైఫల్యంతో దెబ్బతిన్న టీమిండియా చివరకు అశ్విన్ (15 నాటౌట్) ఇన్నింగ్స్తో 173 పరుగులు చేసింది.
ఛేజింగ్లో శ్రీలంకకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సంక (52), కుశాల్ మెండిస్ (57) అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆసలంక (0), గుణతిలక (1) విఫలమైనా భానుక రాజపక్స (25 నాటౌట్), కెప్టెన్ దాసున్ శనక (33 నాటౌట్) ఆ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. చివర్లో వాళ్లిద్దరూ రాణించడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.
పాకిస్తాన్ మ్యాచ్లో జరిగినట్లే 19వ ఓవర్లో భువీ 14 పరుగులివ్వగా.. చివరి ఓవర్లో ఏడు పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఐదో బంతికి రెండు పరుగులు తీసిన శ్రీలంక కెప్టెన్ శనక తమ జట్టుకు విజయాన్నందించాడు. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీసుకోగా.. అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. లంక విజయంతో ఆసియా కప్ నుంచి భారత్ దాదాపు నిష్క్రమించినట్లే.. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఫైనల్ చేరడం అసాధ్యమే.
India lose another close match and Sri Lanka is dominating right now in the Asia Cup.#PathumNissanka #arshdeepsingh #INDvSL #DasunShanaka pic.twitter.com/BKRdDwl1WA
— BetBarter (@BetBarteronline) September 6, 2022