సఫారీలపై గెలుపు కోసం చివరకు వరకు చెమటోడ్చినా టీమిండియాకు నిరాశే మిగిలింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 297 పరుగుల భారీ లక్ష చేధనతో బరిలోకి దిగిన టీమిండియా 265 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 31 పరుగుల తేడాతో సఫారీలు ఘన విజయం సాధించారు. ఫలితంగా 3 వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు తొలుత తడబడినా.. ఆ తర్వాత చెలరేగి ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ సఫారీ బ్యాటర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. డీకాక్ (27), జానెమన్ మలన్ (6), ఎయిడెన్ మార్క్రమ్ (4) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఆ తర్వాత టెంబా బవుమా (110), వాన్ డర్ డస్సెన్ (129 నాటౌట్) భారీ భాగస్వామ్యంతో సౌతాఫ్రికాను గట్టెక్కించారు. ముఖ్యంగా ఆర్వీడీ (వాన్ డర్ డస్సెన్) భారీ షాట్లతో విరుచకుపడ్డాడు. చివర్లో భారీ షాట్కు యత్నించిన బవుమా అవుటయ్యాడు. కానీ అప్పటికే సఫారీ జట్టు 272 పరుగులు చేసింది. చివరి వరకూ ఆర్వీడీ క్రీజులో నిలబడటంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి సఫారీ జట్టు 296/4 స్కోరు చేసింది.
ఇక భారీ లక్ష్య చేధనతో క్రీజులోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (12) ఔటవ్వగా.. శిఖర్ ధవన్ (79), విరాట్ కోహ్లీ (51), శార్దూల్ ఠాకూర్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ధవన్, కోహ్లీ ఇద్దరూ ఔటయ్యే సమయానికి 158/3 స్కోర్తో పటిష్టంగానే కనిపించినా కూడా మిగతా బ్యాటర్లు సరిగ్గా రాణించలేకపోయారు. దీంతో చివర వరకు పరుగుల వేటలో చెమటోడ్చిన ఫలితం లేకుండాపోయింది. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 265 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Sania Mirza | టెన్నిస్కు వీడ్కోలు.. సానియా సంచలన ప్రకటన!
KL Rahul | విరాట్ మేం ఎంతో సాధించగలమనే నమ్మకాన్నిచ్చాడు: కేఎల్ రాహుల్
Test Captain | అతనికి కెప్టెన్సీ ఇవ్వడంలో ప్రాబ్లం ఏంటి?.. అజారుద్దీన్ సూటి ప్రశ్న