భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. కెప్టెన్గా కింగ్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకూ దూరమయ్యాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి కూడా కెప్టెన్సీ చేయడం లేదని ఇది వరకే ప్రకటించాడు. దీంతో ‘కెప్టెన్ కోహ్లీ’ శకం ముగిసినట్లే. తాజాగా టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఈ సమస్యపై స్పందించాడు. తనను అడిగితే టెస్టు పగ్గాలు కూడా రోహిత్కే అప్పగించాలని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాడు రోహిత్ అని చెప్పిన అజారుద్దీన్..అలాంటి వ్యక్తికి టెస్టు కెప్టెన్సీ ఇవ్వడంలో సమస్యేంటని ప్రశ్నించాడు. ‘‘భవిష్యత్తులో మరో 5-6 ఏళ్ల జట్టును ముందుకు నడిపించే వారిని వెతుక్కోవడం అవసరమే. అలాగే ఇప్పటికిప్పుడు జట్టును నడిపించే వాళ్లు కూడా ముఖ్యమే. సడెన్గా కొత్తవాళ్లకు కెప్టెన్సీ ఇచ్చి సమస్యలు సృష్టించడం ఎందుకు?’’ అని అడిగాడు.
కాగా, కోహ్లీ తప్పుకున్న తర్వాత టెస్టు కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే చర్చ జోరుగా సాగుతోంది. రోహిత్, రాహుల్, పంత్, బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి.