న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ లోకేశ్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న రాహుల్.. ఇకపై లక్నో తరఫున బరిలోకి దిగనుండగా.. అతడితో పాటు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 12,13న బెంగళూరు వేదికగా జరుగనున్న ఐపీఎల్ మెగా వేళానికి ముందు ఈనెల 22లోగా కొత్తగా లీగ్లో అడుగుపెట్టిన లక్నో, అహ్మదాబాద్ జట్లకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, రషీద్ఖాన్, శుభ్మన్ గిల్.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.