భారత కెప్టెన్గా యువ కీపర్ రిషభ్ పంత్ వరుసగా ఐదో మ్యాచులోనూ టాస్ ఓడాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఒక్కసారి కూడా పంత్ టాస్ గెలవకపోవడం గమనార్హం. కాగా, గత మ్యాచ్లో గాయపడిన సఫారీ సారధి టెంబా బవుమా ఈ మ్యాచ్ ఆడటం లేదు. దాంతో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఆ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సిరీస్లో డిసైడర్ అయిన ఐదో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని సమాచారం. టాస్ గెలిచిన కేశవ్ మహరాజ్ తమ జట్టులో మూడు మార్పులు జరిగినట్లు చెప్పాడు.
బవుమాతోపాటు తబ్రయిజ్ షంసీ, మార్కో జాన్సెన్ ఆడటం లేదని.. వారి స్థానంలో ట్రిస్టియన్ స్టబ్స్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ ఆడుతున్నట్లు తెలిపాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని పంత్ వెల్లడించాడు.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డీకాక్, రీజా హెండ్రిక్స్, డ్వెయిన్ ప్రిటోరియస్, రాసీ వాన్ డర్ డస్సెన్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), ఆన్రిచ్ నోర్జీ, లుంగి ఎన్గిడీ
🚨 Toss Update 🚨
South Africa have elected to bowl against #TeamIndia in the fifth & final T20I of the series.
Follow the match ▶️ https://t.co/uAE094Srh7 #INDvSA | @Paytm pic.twitter.com/XjlFe4GMdo
— BCCI (@BCCI) June 19, 2022