సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పిచ్ను కవర్స్తో కప్పేశారు. అనంతరం వర్షం మరింత పెద్దదయింది. ఈ కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.
వర్షం ఆగిపోయినా కూడా అవుట్ ఫీల్డ్ను సూపర్ సోకర్స్తో మ్యాచ్కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించినట్లు బీసీసీఐ తెలిపింది. అలాగే 7.50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఒక ఇన్నింగ్స్ పూర్తవగానే ఇచ్చే ఇన్నింగ్స్ బ్రేక్ను కూడా 10 నిమిషాలకు కుదించినట్లు చెప్పింది.
🚨 Update from Bengaluru 🚨
The rain has STOPPED & the covers are coming OFF! 👏 👏
𝗧𝗵𝗲 𝗽𝗹𝗮𝘆 𝘀𝘁𝗮𝗿𝘁𝘀 𝗮𝘁 𝟬𝟳:𝟱𝟬 𝗣𝗠 𝗜𝗦𝗧.
𝗜𝘁 𝘄𝗶𝗹𝗹 𝗯𝗲 𝗮 𝟭𝟵 𝗢𝘃𝗲𝗿𝘀 𝗽𝗲𝗿 𝘀𝗶𝗱𝗲 𝗴𝗮𝗺𝗲.
Innings break duration: 10 Mins#TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/4O7OmHT5yw
— BCCI (@BCCI) June 19, 2022