హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటుచేసి సిబ్బందికి 32 రకాల పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు. పోలింగ్ స్టేషన్లకు జంబో, మిని బ్యాలెట్ బాక్స్లను తరలిస్తున్నారు. సాయంత్రంలోగా వారికి కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు.
సోమవారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లను నియమించుకుని మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్లగొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గౌడన్స్కు చేరుకోనున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు.