బ్యాంకాక్: బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం పురుషుల 80కిలోల విభాగంలో అభిమన్యు లౌరా 3-0 తేడాతో క్రిస్టియన్ నికోలోవ్(బల్గేరియా)పై అద్భుత విజయం సాధించాడు.
ఈ ఇద్దరు యువ బాక్సర్ల మ ధ్య ఆఖరి వరకు హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్లో బల్గేరియా బాక్సర్ ఆధిపత్యం ప్రదర్శిస్తే..మిగిలిన రెండు రౌండ్లలో అభిమన్యు పుంజుకుని పోటీలోకి వచ్చాడు. ప్రత్యర్థి బాక్సర్ పంచ్లను తిప్పికొడుతూ ఎదురుదాడితో కీలక పాయిం ట్లు ఖాతాలో వేసుకున్నాడు.