ఆసియా కప్లో భాగంగా హాంగ్కాంగ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు రోహిత్ శర్మ (21) మంచి ఆరంభమే ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36) చాలా నెమ్మదిగా ఆడటంతో స్కోరుబోర్డు నత్తనడకన సాగింది. ఇలాంటి సమయంలో రాహుల్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) అదరగొట్టాడు.
వచ్చినప్పటి నుంచి ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీ (59 నాటౌట్) కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. హాంగ్కాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్ల, మహమ్మద్ ఘజన్ఫర్ చెరో వికెట్ తీసుకున్నారు.
Suryakumar Yadav's blitz and Virat Kohli's anchor knock have led India to huge total against Hong Kong 👏
Scorecard: https://t.co/KCTYiEseCB#INDvHK #AsiaCup2022 pic.twitter.com/t0ZgoggxO4
— Cricket Pakistan (@cricketpakcompk) August 31, 2022