Sarfaraz Khan: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ నేడు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. మిగిలిన టెస్టుల నుంచి తప్పుకోగా హైదరాబాద్, వైజాగ్ టెస్టులలో విఫలమైన శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు కారణం చెప్పకుండానే పక్కనబెట్టారు. హైదరాబాద్ టెస్టులో ఆడి గాయపడ్డ కెఎల్ రాహుల్తో పాటు రవీంద్ర జడేజాలు మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉన్నా ఈ ఇద్దరూ మెడికల్ క్లీయరెన్స్ వస్తే గానీ ఆడేది రానిది స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా భారత జట్టులో చోటు కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను తుది జట్టులో ఆడించాలని అభిమానులు కోరుతున్నారు.
గత రెండు మూడేండ్లుగా దేశవాళీ క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. 2022లో భారత జట్టు బంగ్లాదేశ్ టూర్కు వెళ్లినప్పట్నుంచీ జట్టులో చోటు కోసం వేచి చూస్తున్నాడు. నాటి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తనకు బంగ్లా టూర్లో అవకాశమిస్తానన్నాడని గతంలో సర్ఫరాజ్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కానీ అధిక బరువు, ఫిట్నెస్, సెలక్టర్లపై అనాలోచిత వ్యాఖ్యల కారణంగా సర్ఫరాజ్ను బీసీసీఐ పక్కనబెట్టింది. కానీ ఇటీవల కాలంలో అతడు ‘ఒళ్లు దగ్గరబెట్టుకుని’ మాట్లాడటే గాక ఆటలో కూడా పరిణితి సాధించాడు. కొద్దిరోజుల క్రితమే ఇండియా – ‘ఎ’ టీమ్లోకి వచ్చి ఇక్కడా పరుగుల వరద పారిస్తుండటంతో సర్ఫరాజ్కు ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో చోటు దక్కింది. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కానీ రజత్ పాటిదార్తో పోటీ నేపథ్యంలో సర్ఫరాజ్ బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
I guess the time has come for Sarfaraz Khan. It’s time for him to receive his maiden Test cap and make his debut for India in the series against England. 🇮🇳🌟#SarfarazKhan #INDvENG #INDvsENG pic.twitter.com/AYw8CrhFMB
— Saabir Zafar (@Saabir_Saabu01) February 10, 2024
తాజాగా మూడో టెస్టులో శ్రేయస్ అయ్యర్ను పక్కనబెట్టడంతో సర్ఫరాజ్ను ఆడించాలని అభిమానులు కోరుతున్నారు. రాజ్కోట్ వేదికగా జరగాల్సి ఉన్న టెస్టులో అతడికి అవకాశమివ్వాలని, ఇప్పటికైనా అతడిని గుర్తించాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
Expecting Sarfaraz Khan to debut in next match because of the God Gift to Mumbai players to play well in their debut test.
— Varad Tamhankar (@Varad_Tamhankar) February 10, 2024
భారత సీనియర్లు రోహిత్, కోహ్లీలు కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో జూనియర్లకు అవకాశాలిచ్చి వాళ్లను ఫ్యూచర్ స్టార్లుగా మార్చాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. మరి అభిమానుల ఆశలను టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకుంటుందా..? అనేది తెలియాలంటే ఈ నెల 15 దాకా వేచి చూడాల్సిందే..