IND vs ENG 3rd Test | రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్.. రోహిత్ శర్మ (131) తో పాటు రవీంద్ర జడేజా (100 బ్యాటింగ్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సెంచరీలతో కదం తొక్కారు. రెండో సెషన్లో రోహిత్.. మూడంకెల స్కోరు చేయగా మూడో సెషన్లో జడ్డూ ఆ ఘనతను అందుకున్నాడు. సొంతగడ్డపై టెస్టు ఆడుతున్న జడ్డూ.. 198 బంతులలో శతకం పూర్తిచేశాడు. జడ్డూకు టెస్టులలో ఇది నాలుగో శతకం. జడ్డూతో పాటు ఈ టెస్టులోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 62, 9 ఫోర్లు, 1 సిక్సర్) దంచికొట్టడంతో భారత్.. భారీ స్కోరు దిశగా సాగుతోంది.
జైస్వాల్ (10), గిల్ (0), రజత్ పాటిదార్ (5)లు త్వరత్వరగా ఔటైనా ఐదోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ.. రోహిత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఈ ఇద్దరూ తమ అనుభవన్నాంత రంగరించి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయడమే గాక భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా ఆడారు. నాలుగో వికెట్కు ఈ ద్వయం 329 బంతులాడి 204 పరుగులను జోడించింది. తద్వారా నాలుగో వికెట్కు భారత్ తరఫున గతంలో మహ్మద్ అజారుద్దీన్ – మోహిందర్ అమర్నాథ్ లు నెలకొల్పిన రికార్డు (190)ను బ్రేక్ చేశారు.
Test Hundred on his home ground!
A hard fought 4th Test ton and second in Rajkot from @imjadeja 👏 👏#INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/osxLb6gitm
— BCCI (@BCCI) February 15, 2024
టీ విరామం తర్వాత కొద్దిసేపటికే రోహిత్ వికెట్ కోల్పోయినా సర్ఫరాజ్ ఖాన్తో కలిసి జడేజా సెంచరీ దిశగా కదిలాడు. సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతుండగా జడేజా మాత్రం నెమ్మదించాడు. జడేజా 84 పరుగుల వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. 48 బంతులలోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే జడేజా 99 పరుగుల వద్ద అనవసర పరుగుకు యత్నించి సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. 82 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్.. 5 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది.