భువనగిరి అర్బన్, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో జరిగే రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరి తుర్కపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం మీదుగా వెళ్లారు.
వివిధ వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డు వెంట ఉండి జేజేలు పలికారు. కేసీఆర్ కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.