ICC : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జట్లను పాకిస్థాన్(Pakistan)కు పంపేందుకు భారత్తో సహా పలు దేశాలు ఇష్టపడడం లేదు. దాంతో, ఈ టోర్నీ వేదికను పాక్ నుంచి తరలిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే తమకు నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఐసీసీకి స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్(Iceland Cricket) ఐసీసీకి ఓ లెటర్ రాసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులు తమకు ఇవ్వాలని ఎక్స్ వేదికగా ఐసీసిని రిక్వెస్ట్ చేసింది.
‘మేము వెనక్కి తగ్గేవాళ్లం కాదు. ఈరోజు మేము ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం కోసం బిడ్ వేశాం. గ్రెగ్ బార్క్లే బృందం ఏం చెప్తుందనే దానికోసం ఎదురుచూస్తున్నాం’ అని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
We are not people who hold back. We have today issued our bid to host the Champions Trophy of 2025, and we look forward to hearing what Greg Barclay of @ICC has to say about it. pic.twitter.com/EsRzsikCqF
— Iceland Cricket (@icelandcricket) November 27, 2023
షెడ్యూల్ ప్రకారం చాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్థాన్కు పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. మరికొన్ని జట్లు కూడా పాక్ గడ్డపై ఆడేందుకు సిద్ధంగా లేదు. దాంతో, ఐసీసీ ఈసారి టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించే ఆలోచనతో ఉంది. వన్డే వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో టాప్ -7 స్థానాల్లోని జట్లు నేరుగా చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి.
భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. చివరి రెండు బెర్తుల కోసం శ్రీలంక, నెదర్లాండ్స్ పసికూనలతో పోటీపడనున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణలోనూ అనిశ్చితి నెలకొంది. చివరకు ఐసీసీ… హైబ్రిడ్ మోడల్లో శ్రీలంక, పాక్లో కొన్ని మ్యాచ్లు నిర్వహించిన విషయం తెలిసిందే.