ముంబై: కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. అయితే వెన్ను స్వల్పంగా పట్టివేయడం వల్ల అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినట్లు లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తెలిపాడు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మ 12 బంతుల్లో 11 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో 24 రన్స్ తేడాతో ముంబై జట్టు కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. స్వల్పంగా వెన్ను పట్టివేయడం వల్ల ముందస్తు జాగ్రత్తగా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినట్లు చావ్లా తెలిపాడు.
ముంబై జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 8 మ్యాచుల్లో ఆ జట్టు ఓటమి చవిచూసింది.అయిదుసార్లు చాంపియన్ అయిన ముంబై జట్టు ఈ సారి ఇంకా గాడిలో పడలేదు. తమకు ఇంకా మూమెంటం దొరకలేదని చావ్లా పేర్కొన్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా చావ్లా నిలిచాడు. అతను ఇప్పటి వరకు 184 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ జర్నీ అద్భుతంగా సాగిందని, 17 ఏళ్లుగా ఆడుతున్నానని, మొదట్లో స్పిన్నర్లకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఎక్కువ వికెట్లు తీస్తున్నవారిలో స్పిన్నర్లే ఉన్నట్లు గుర్తు చేశాడు.