KTR | ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒకవైపు, గత రెండు దశాబ్దాలుగా.. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఒక క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు మరోవైపు అని చెప్పారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పార్టీ అధినేత కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడని వెల్లడించారు.
2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సుధీర్ కుమార్ ఉద్యమ సమయంలో జైలు జీవితాన్ని కూడా గడిపారని వెల్లడించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలందిస్తున్న సుధీర్ కుమార్.. తన నర్సింగ్ హోమ్ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలు కూడా అందించారని గుర్తుచేశారు. విద్యావేత్త అయిన సుధీర్ కుమార్ ఎంపీగా గెలిస్తే.. వరంగల్ పార్లమెంట్ ప్రజల సమస్యలపై గళమెత్తుతారని, హక్కుల కోసం గట్టిగా పోరాడుతారని చెప్పారు. సుధీర్ కుమార్ గెలుపు.. వరంగల్ పార్లమెంట్కు మలుపని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
🔷 ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది
🔷 పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఒకవైపు. గత రెండు దశాబ్దాలుగా.. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఒక క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు మరోవైపు… pic.twitter.com/2OcnCzkaPn
— KTR (@KTRBRS) May 4, 2024