ICC : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)పై నెలకొన్న అనిశ్చితిలో మరో మలుపు. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్కు వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చేయగా.. హైబ్రిడ్ మోడల్(Hybrid Model)కు అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీమిండియా (Team India) మ్యాచ్లకు దుబాయ్ వేదిక కానుందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11వ తేదీన జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ను రద్దు చేసింది.
‘చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశంతో పాటు ఈ టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల బోర్డులతోనూ మేము చర్చలు జరుపుతున్నాం. షెడ్యూల్పై స్పష్టత వచ్చాక మేము అధికారికంగా వెల్లడిస్తాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్ల వేదకను నిర్ణయించాకే షెడ్యూల్ విడుదల చేయడం ఖాయమనిపిస్తోంది.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
The BCCI informed the ICC that India will not travel to Pakistan for the 2025 Champions Trophy 🇮🇳🏏
The BCCI stated that it had been advised by the Indian government not to send the team to Pakistan 🇵🇰#India #ChampionsTrophy #ODIs #Sportskeeda pic.twitter.com/hBfjCLdva4
— Sportskeeda (@Sportskeeda) November 9, 2024
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లోనే జరగాలి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకూ సాగే టోర్నీ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానీ, భద్రత కారణాల రీత్యా భారత జట్టును పాక్కు పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్ల నిర్వహించడం తప్ప మరో దారి కనిపించడం లేదు. అయితే.. హైబ్రిడ్ మోడల్కు తాము అంగీకరించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) స్పందించాడు.
India hasn’t visited Pakistan since the 2008 Asia Cup, and the 2025 Champions Trophy won’t change that ✈️
More details 👇 https://t.co/qvgeFoJSer
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2024
వచ్చే ఏడాది తమ దేశంలోనే చాంపియన్స్ ట్రోఫీ జరుగనుందని, అందుకు అన్ని దేశాల బోర్డులు సుముఖంగా ఉన్నాయని నఖ్వీ చెప్పాడు. భారత జట్టు పాక్కు రావడంలేదనే వార్తల్లో నిజం లేదని, ఈ విషయమై తమకు బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పీసీబీ బాస్ మీడియాతో తెలిపాడు.
అయితే.. బీసీసీఐ మాత్రం తమ జట్టును పాక్ గడ్డ మీదకు పంపే ఉద్దేశం లేదని ఐసీసీకి గట్టిగానే చెప్పింది. దాంతో, ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నవంబర్ 11న నిర్వహించ తలపెట్టిన చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ను ఐసీసీ రద్దు చేసింది.