Virat Kohli on RCB | టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) కెప్టెన్గా 2021 సీజన్ వరకు మాత్రమే కొనసాగుతానని ఆదివారం ప్రకటించారు.
ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ టోర్నీలో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని విరాట్ కోహ్లీ తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అభిమానులంతా స్వాగతిస్తారని అనుకుంటున్నానని అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీ -20 టీమిండియా కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.