China Masters: చైనాలోని షెన్జెన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు ఆశించిన ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో ఇండియా స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్తో పాటు డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి – సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డిలు రెండో రౌండ్కు చేరారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోటీలలో వీళ్లు విజయాలు సాధించి ముందంజ వేశారు.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్.. 21-18, 22-20 తేడాతో చైనీస్ తైఫీకి చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ టీన్ చెన్ను ఓడించాడు. 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్నాడు. ఆట ఆరంభంలో 6-9 తో వెనుకబడ్డ ప్రణయ్.. బ్రేక్ సమయానికి పుంజుకున్నాడు. రెండో గేమ్లో ఇరువురూ హోరాహోరి తలపడ్డా చివరికి ప్రణయ్నే విజయం వరించింది. వారం రోజుల క్రితం చౌ టీన్.. జపాన్ మాస్టర్స్లో ప్రణయ్ను ఓడించాడు.
HS Prannoy knocks OUT former World No. 2 Chou Tien-chen 21-18, 22-20 in opening round of CHina Masters.
Prannoy had lost to the him in 3 out of their last 4 matches. #ChinaMasters2023 pic.twitter.com/Wv07FRe721
— India_AllSports (@India_AllSports) November 21, 2023
ఇక డబుల్స్లో ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ చిరాగ్-సాత్విక్లు.. 21-13, 21-10 తేడాతో బ్రిటన్కు చెందిన బెన్ లేన్ – సీన్ వెండీ ద్వయాన్ని ఓడించి రెండో రౌండ్కు దూసుకెళ్లారు. 37 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత ద్వయానిదే ఆధిపత్యం. మహిళల సింగిల్స్లో ఆకర్ష కశ్యప్.. 12-21, 14-21 తేడాతో చైనాకు చెందిన ప్రపంచ 17వ ర్యాంకర్ జంగ్ యి చేతిలో ఓడింది. ఈ టోర్నీలో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజవత్లు బుధవారం తమ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడనున్నారు.