బండ్లగూడ,మే 4: హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని హసన్నగర్కు చెందిన మక్బూల్ శనివారం రాత్రి స్థానిక ఇంద్రానగర్ బస్టాప్ వద్ద చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి వస్తున్నారనే సమాచారంతో వేచి ఉన్నారు.
ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన అంజాద్ అనే వ్యక్తి అతడిపై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మక్బూల్ను పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఓ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.