Doping Test : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అనుకోని రికార్డు సాధించాడు. అత్యధిక సార్లు డోపింగ్ టెస్టు చేయించుకున్న భారత క్రికెటర్గా నిలిచాడు. ఓ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక సమాచార హక్కు చట్టం(RTI) కింద పిల్ దాఖలు చేయడంతో 2021-22 మధ్య కాలంలో నాడా(NADA) జరిపిన పరీక్షల వివరాలన్నీ బహిర్గతమయ్యాయి. క్రికెటర్లు ఎవరు, ఎన్ని సార్లు ఈ పరీక్షలకు హాజరయ్యారు అన్న సంగతి బయటికొచ్చింది. ఆర్టీఐ నివేదిక ప్రకారం రోహిత్శర్మ అందరికంటే ఎక్కువగా ఆరుసార్లు డోపింగ్ పరీక్షలకు హాజరైనట్లు తెలిసింది.
నయావాల్ ఛతేశ్వర్ పుజారా(Chateshwar Pujara), విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav)పై ఒక్కోసారి పరీక్షలు జరిగాయి. అయితే.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై మాత్రం ఒక్కసారి కూడా డోపింగ్ పరీక్షలు జరుగలేదట. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న 25మంది ఆటగాళ్లపై నాడా పరీక్షలు జరిగాయి.
ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ
అయితే.. 12 మందికి అసలు టెస్టులే జరుగలేదట. ఈ 12 మందిలో ఉన్నది ఎవరంటే..? టీ20 కెప్టెన్ హార్దిక్పాండ్యా(Hardhik Pandya), సీనియర్ పేసర్ షమీ, సిరాజ్, ఉమేశ్యాదవ్, శార్దుల్ ఠాకూర్, అర్ష్దీప్సింగ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్హుడా, శాంసన్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్.
స్మృతి మంధన, హర్మన్ప్రీత్ కౌర్
మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur), స్మృతి మంధన(Smrithi Mandhana) మూడు సార్లు డోపింగ్ పరీక్షలు ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్లపై 114 డోపింగ్ పరీక్షలు జరిగాయట. మొత్తంగా అథ్లెట్స్పై 5,961 పరీక్షలు జరుగగా, క్రికెటర్లపై కేవలం 1.91 శాతం మాత్రమే కావడం విశేషం. దేశ వ్యాప్తంగా అందరికంటే ఎక్కువగా అథ్లెట్లపై 1,717 పరీక్షలు జరిగాయి.
డోపింగ్ నిరోధక సంస్థలు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా సరే ఈ జాఢ్యం మాత్రం క్రీడలను వీడటం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పోటీపడే ప్లేయర్లకు డోపింగ్ టెస్టు అనేది నిత్యకృత్యం. టోర్నీ ప్రారంభానికి ముందు టోర్నీల తర్వాత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) పరీక్షలు చేస్తూనే ఉంటుంది. అయితే.. 2019లో తొలిసారి నాడా పరిధిలోకి క్రికెటర్లు వచ్చాక పలు ఆసక్తికర ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి.