Lionel Messi : అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన మాయాజాలంతో మెస్సీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మదిని దోచుకున్నాడు. ఈ దిగ్గజం ఆటను స్వయంగా వీక్షించేందుకు ప్రతీ ఒక్కరు ఆసక్తి కనబరుస్తుంటారు. పారిస్ జెయింట్ జర్మన్(PSG)ను వీడిన మెస్సీ.. ఈమధ్యే ఇంటర్ మియామి(Inter Miami) జట్టుకు మారాడు. మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్లో ఇంటర్ మియామీ తరఫున మెస్సీ ఆడబోతున్నాడు.
తమ ఆరాధ్య ఆటగాన్ని చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎన్ఎన్(CNN) వార్తాసంస్థ కథనం ప్రకారం.. ఒక్కో టిక్కెట్ మన భారత కరెన్సీలో అక్షరాలా రూ. 90 లక్షల ధర పలుకుతుందట. మేజర్ లీగ్ సాకర్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధరగా నమోదైందని సదరు సంస్థ పేర్కొంది. మామూలగా అయితే టిక్కెట్ ధర రూ.39,900. కానీ, మెస్సీకి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని నిర్వాహకులు టిక్కెట రేట్లను అమాంతం పెంచేశారు.
లియోనల్ మెస్సీ, డేవిడ్ బెక్హమ్
మెస్సీ..ఇంటర్ మియామీతో కలిసి రెండున్నర ఏండ్లు కొనసాగనున్నాడు. డేవిడ్ బెక్హమ్(David Beckham) సహ యజమానిగా వ్యవహరిస్తున్న ఈ అమెరికా క్లబ్కు అతడి రాక మరింత జోష్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తున్నది. గత ఏడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్(FIFA WC 20222)ను అర్జెంటీనా దక్కించుకోవడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. తనదైన ఆటతీరుతో తన దేశ సుదీర్ఘ కలను సాకారం చేశాడు. ఈ లెజెండరీ ఫుట్బాలర్ మరో వరల్డ్ కప్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెస్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.