INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్లో చావోరేవో మ్యాచ్. భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ రేసులో ఉండే పరిస్థితిలో భారత బ్యాటర్లు పంజా విసిరారు. ఆసియా కప్ ఫైనల్లో షాకిచ్చిన శ్రీలంకపై కొండంత స్కోర్ కొట్టారు. ఓపెనర్లు స్మృతి మంధాన(50), షఫాలీ వర్మ(43) తొలిసారి అదిరే ఆరంభమివ్వగా.. ఆఖర్లో హర్మన్ప్రీత్ కౌర్(52 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆఖరి ఓవర్లో వరుసగా రెండు బంతుల్ని బౌండరీకి పంపి అర్ధ శతకంతో జట్టు స్కోర్ 170 దాటించింది. ఈ ముగ్గురి దూకుడు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే 172 పరుగులు చేసింది. ఈసారి వరల్డ్ కప్లో ఇదే అత్యధిక స్కోర్.
తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారీ ఓటమి. ఆ తర్వాత పాకిస్థాన్పై గెలిచాము చాలు అన్న ఫీలింగ్. ఈ దశలో మూడో మ్యాచ్ ఆసియా కప్ విజేతతో. లంకను దాటితేగానీ సెమీస్ చేరడం కష్టమనే దశలో భారత అమ్మాయిలు బ్యాట్ ఝులిపించారు. మెగా టోర్నీలో తొలిసారి ఓపెనర్లు షఫాలీ వర్మ(43), స్మృతి మంధాన(50)లు పవర్ ప్లేలో దంచికొట్టారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది.
Captain Harmanpreet Kaur finishes the innings in style with a four 🙌
She completes her half-century as well! 👏👏
A fine knock that from the skipper! 👌👌
📸: ICC
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#TeamIndia | #T20WorldCup | #INDvSL | #WomenInBlue pic.twitter.com/8VEpFfP5eX
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
లంక స్పిన్నర్లు దీటుగా ఎదుర్కొంటూ లెగ్ సైడ్లో బౌండరీలు బాదేసింది. దాంతో.. టీమిండియా స్కోర్ వడివడిగా.. 150 దాటేసింది. ఆఖరి మూడు ఓవర్లలో మరింత రెచ్చిపోయిన కౌర్ బౌండరీలతో విరుచుకుపడింది. రీచా ఘోష్(6) అండగా ధనాధన్ ఆడింది. చివరి ఓవర్లో రెండు ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన ఆమె లంకకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.