గాయంతో టీమిండియాకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్ పాండ్యానే అని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కితాబిచ్చాడు. పాండ్యా చాలా సత్తా ఉన్న ఆటగాడని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న రవిశాస్త్రి.. పాకిస్తాన్పై పాండ్యా ఆటతీరు చూసిన తర్వాత మరింత సంతోషం వ్యక్తం చేశాడు.
భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో పాండ్యా ఒకడని, అతను లేకపోతే జట్టులో సమతుల్యత దెబ్బతింటుందని చెప్పాడు. పాండ్యా లేకపోతే ఎక్స్ట్రా బౌలర్ను తీసుకోవాలో, బ్యాటర్ను తీసుకోవాలో నిర్ణయించుకోలేమన్నాడు. గత టీ20 ప్రపంచకప్లో పాండ్యా బౌలింగ్ను భారత్ చాలా మిస్ అయిందని వివరించాడు. తను బౌలింగ్ చేస్తే జట్టు కూర్పు అంతా మారిపోతుందని, అంత క్వాలిటీ ఆటగాడు మరొకరు లేరని కితాబిచ్చాడు.
Needed the best T20 all-rounder in the business to power India across the finish line – @hardikpandya7 🇮🇳🙌🏻 pic.twitter.com/78zXFF3Ctm
— Ravi Shastri (@RaviShastriOfc) August 29, 2022