హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. తాము ఎంచుకున్న క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. రాజ్కోట్ వేదికగా ఈనెల 20నుంచి మొదలయ్యే అండర్-19 మహిళల వన్డే టోర్నీకి ఎంపిక చేసిన హైదరాబాద్ క్రికెట్ జట్టుకు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన అంజలి(బుద్వేల్), నవ్య (మన్ననూర్)తో పాటు గిరిజిన సంక్షేమ పాఠశాల విద్యార్థులు పార్వతి, రజిత ఉన్నారు. హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్న వీరిని గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్, క్రీడాధికారి రామ్లక్ష్మణ్, విజయలక్ష్మి, శేషు కుమారి బుధవారం హైదరాబాద్లో అభినందించారు.