IND vs SL : శ్రీలంక పర్యటనలో రెండు టీ20ల్లో దంచేసిన భారత(India) బ్యాటర్లు నామమాత్రమైన మూడో మ్యాచ్లో తేలిపోయారు. లంక స్పిన్నర్ల ఉచ్చులో పడి వికెట్ పారేసుకున్నారు. ఒకదశలో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జట్టును ఓపెనర్ శుభ్మన్ గిల్(39) ఆదుకున్నాడు. ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) అండగా ఆరో వికెట్కు 54 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(25) మెరుపు బ్యాటింగ్తో జట్టు స్కోర్ 130 దాటించాడు. దాంతో, టీమిండియా ఆతిథ్య జట్టుకు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టాస్ ఓడిన భారత్కు లంక బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)ను థీక్షణ వెనక్కి పంపి తొలి వికెట్ అందించాడు. ఇక అరంగేట్ర బౌలర్ చమిందు విక్రమ సింఘే డేంజరస్ సంజూ శాంసన్(0)ను బోల్తా కొట్టించాడు.
Back-to-back T20I ducks for Sanju Samson in the #SLvIND series😮
He is Chamindu Wickramasinghe’s first international wicket today in Pallekele ☝ https://t.co/K0RzKUICIm pic.twitter.com/Vv5MDPgW20
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2024
అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రింకూ సింగ్(1)ను థీక్షణ వెనక్కి పంపేశాడు. దాంతో,ర 14 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో శివం దూబే(8) కాసేపు నిలబడ్డాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయిన పెనర్ శుభ్మన్ గిల్(39) కీలక పరుగులు సాధించాడు. దూబే తర్వాత వచ్చిన రియాన్ పరాగ్(26) జతగా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. హసరంగ వేసిన 14వ ఓవర్లో పరాగ్ రెచ్చిపోయాడు. రెండు సిక్సర్లు బాది 15 పరుగులు పిండుకున్నాడు. అక్కడితో భారత స్కోర్ బోర్డు వేగం పెరిగింది.
India were 30/4 after the powerplay, and the remaining batters rallied around Shubman Gill for the rest of the innings
What did you make of the batting today? 🤔 https://t.co/K0RzKUICIm #SLvIND pic.twitter.com/ZuBgabQLZG
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2024
ఆ తర్వాత కమిందు మెండిస బౌలిగ్లో స్వీప్ షాట్ ద్వారా బౌండరీ బాదిన గిల్ జట్టు స్కోర్ వంద దాటించాడు. ఆరో వికెట్కు 54 పరుగులు జోడించారు. అయితే.. హసరంగ మరుసటి ఓవర్లో రెండో బంతికి గిల్ స్టంపౌట్ అయ్యాడు. ఐదో బంతికి పరాగ్ బౌండరీ వద్ద దొరికిపోయాడు. ఆర్వాత వాషింగ్టన్ సుందర్(25), టెయిలెండర్ రవి బిష్ణోయ్(8 నాటౌట్) సాయంతో 32 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 రన్స్ కొట్టింది. లంక బౌలర్లలో మహీశ్ థీక్షణ మూడు, హసరంగ రెండు వికెట్లు పడగొట్టారు.