Paris Olympics 2024 : ఒలింపిక్స్లో పతకం ఖాయమనుకున్న బాక్సింగ్లో భారత్కు భారీ షాక్. కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో మెరిసిన అంతిమ్ పంగల్(Antim Panghal) విశ్వ క్రీడల్లో మాత్రం నిరాశపరిచాడు. 51 కిలోల విభాగంలో మెడల్ గెలుస్తాడనుకున్న ఈ స్టార్ బాక్సర్ 16వ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మంగళవారం జాంబియా బాక్సర్ ప్యాట్రిక్ చిన్యెంబా(Patrick Chinyemba)తో అమిత్ తలపడ్డాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పంచ్లతో దాడి చేసిన భారత బాక్సర్ పాయింట్లు మాత్రం సాధించలేకపోయాడు.
తొలి రౌండ్ తర్వాత కోచ్ సలహా మేరకు అంతిమ్ వ్యూహం మార్చాడు. అయినా సరే అతడికి కలిసి రాలేదు. చివరకు మెజారిటీ అంపైర్ల నిర్ణయం మేరకు భారత బాక్సర్ ఓటమిపాలయ్యాడు. దాంతో, మహిళా బాక్సర్లు నికత్ జరీన్, నిషాంత్ దేవ్, లొవ్లినా బొర్గెహైన్లపైనే భారత్ పతకం ఆశలు పెట్టుకుంది.