MSK Prasad : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కాసులు కురిపించే ఈ లీగ్లో క్రికెట్కు వీడ్కోలు పలికిన సీనియర్లు కూడా భాగమవుతున్నారు. కోచ్గా, మెంటార్గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) కూడా ఐపీఎల్ జట్టులో చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) టీమ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్(Strategic Consultant)గా అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం అధికారికంగా ఈరోజు ప్రకటించింది.
‘ప్రసాద్ అనుభవం, క్రికెట్పై అతడికున్న ప్రేమ మాకు ఎంతో ఉపయోగపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. అతడి సేవలు మా ఫ్రాంచైజీకి ఎంతో ఉపకరిస్తాయి’ అని లక్నోమేనేజ్మెంట్ తెలిపింది. అనుభవజ్ఞుడైన ప్రసాద్ రాకతో లక్నో జట్టు బలోపేతం కానుంది. స్ట్రాటజిక్ అనలిస్ట్గా అతను ప్రతిభావంతులైన క్రికెటర్లను కనిపెట్టడం , వాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపరచడం వంటివి చూసుకోనున్నాడు.
Former India cricketer MSK Prasad joins the Super Giants as our Strategic Consultant! 🤝
Full story 👉 https://t.co/kwtmp8awBE pic.twitter.com/gW9kiQJePM
— Lucknow Super Giants (@LucknowIPL) August 17, 2023
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ప్రసాద్ భారత జట్టు సెలెక్టర్గా పనిచేశాడు. అంతేకాదు ఆంధ్ర క్రికెటో అసోసియేషన్ డైరెక్టర్గా సేవలందించాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 96 మ్యాచ్లు ఆడిన ప్రసాద్ 4,000 రన్స్ చేశాడు. జాతీయ జట్టు తరఫున 1999 నుంచి 2001 మధ్యలో 6 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు.
ప్లేఆఫ్స్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన లక్నో జట్టు
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ దాటలేకపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయంతో టోర్నీకి దూరం కావడం, కీలక మ్యాచ్లో ప్రధాన ఆటగాళ్లు రాణించకపోవడం ఆ జట్టు అవకాశాల్ని దెబ్బతీశాయి. దాంతో, 17వ సీజన్లో కప్పు కొట్టాలనే లక్ష్యంతో లక్నో ప్రణాళికలు రచిస్తోంది. ఈమధ్యే హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower)ను తప్పించింది. అతడి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్(Justin Langer)ను నియమించిన విషయం తెలిసిందే.