Adille Sumariwalla : భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు(Athletics Federation of India) అదిల్లే సుమరివల్లా(Adille Sumariwalla)కు అరుదైన గౌరవం దక్కింది. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గురువారం వరల్డ్ అథ్లెటిక్స్(World Athletics) ఎక్జిక్యూటివ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. దాంతో, ఈ పదవిని అలంకరించిన మొదటి భారతీయుడిగా 65 ఏళ్ల సుమరివల్లా గుర్తింపు సాధించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. నాలుగేళ్ల పాటు సుమరివల్లా ఈ హోదాలో సేవలందిస్తాడు.
వరల్డ్ చాంపియన్షిప్స్ పోటీలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వరల్డ్ అథ్లెటిక్స్ ఎక్జిక్యూటివ్ బోర్డులో అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు అపాయింటెడ్ సభ్యులు, ఒక నాన్ ఓటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఉంటారు. సుమరివల్లాతో పాటు క్సిమెనా రెస్ట్రెపో, రౌల్ చాపడో, జాక్సన్ టువెల్ ఉపాధ్యక్షలుగా ఎన్నికయ్యారు.
Ximena Restrepo, Raúl Chapado, Adille Sumariwalla and Jackson Tuwei have been elected as World Athletics Vice-Presidents at the 54th World Athletics Congress. pic.twitter.com/S8lzYLx5Qb
— World Athletics (@WorldAthletics) August 17, 2023
ఒకప్పుడు సుమరివల్లా విజయవంతమైన అథ్లెట్. ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు కూడా. ఆయన 2012 నుంచి భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు అతను 2015 నుంచి వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. అథ్లెటిక్స్ నిర్వహణపై సుదీర్ఘ అనుభవం ఉన్న సుమరివల్లా ఇకపై తన సేవల్ని విస్తరించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ, విధానంపై తన ముద్ర వేయనున్నాడు.