Sunita Williams | భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్లైనర్ స్పేస్షిప్లో ఈ నెల 7న స్పేస్లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతున్నది. స్టార్లైనర్ స్పేస్షిప్ మంగళవారం ఉదయం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా సునీతా విలియమన్స్ మాట్లాడుతూ.. కొత్త స్పేస్క్రాఫ్ట్లో ప్రయాణించబోతున్నందున తాను కొంచెం ఉద్విగ్నంగా ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నానన్నారు. నేను ఇంటర్నేషన్ స్పేస్సెంటర్ కేంద్రానికి వెళ్లిన సమయంలో ఇంటికి తిరిగి వెళ్లినట్లుగా ఉంటుందన్నారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎన్నో విజయాలు నమోదు చేశారు. అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండోస్థానంలో నిలిచింది. అంతరిక్షంలో ఎక్కువ సమయంపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. సునీతా విలియమ్స్కి ఇది మూడో అంతరిక్ష యాత్ర. ఇంతకు ముందు 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. రెండు మిషన్లలో 322 అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఆమె పేరుతో మరో రికార్డు సైతం ఉన్నది. సునీత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేసింది. నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపింది. 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేశుడి విగ్రహం, ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లారు. రెండో మిషన్ నవంబర్ 18, 2012న ముగిసింది.
సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ ప్యాండ్యా గుజరాత్లోని మెహసానా జిల్లాలోని జులాసన్లో సన్మించారు. అమెరికా వెళ్లిన తర్వాత బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం, సునీత ఇప్పుడు బోయింగ్ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ పైలట్గా మారేందుకు రెడీ అయ్యారు. ఆమె జూన్ 1998లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంపికయ్యారు. ఆమె మొదటిసారిగా డిసెంబర్ 9, 2006న అంతరిక్షంలోకి వెళ్లింది. రెండోసారి 2012లో స్పేస్లోకి వెళ్లారు. మూడసారి స్పేస్లోకి వెళ్లే ముందు వినాయకుడి విగ్రహాన్ని తన వెంట తీసుకువెళ్లనున్నట్లు సునీతా విలియమ్స్ చెప్పారు. గణేశుడి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. గతంలో సునీత భగవద్గీతను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. గతంలోనూ భగవద్గీత కాపీలను స్పేస్లోకి తీసుకెళ్లారు. తనకు సమోసా అంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది.
సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 19, 1965న యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ చేశారు. నాసాలో చేరడానికి ముందు ఆమె యూఎస్ నేవీలో సేవలందించారు. ఆ సమయంలో 30కి పైగా వివిధ విమానాలలో 3వేల గంటలకుపైగా ప్రయాణించారు. తాజాగా సునీతా విలియమ్స్ ప్రస్తుతం మూడో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది. భారత సంతతికి చెందిన సునీతను పలు దేశాల ప్రభుత్వాలు గౌరవించాయి. భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలో మెరిట్తో సత్కరించింది. అదే సమయంలో, స్లోవేనియా ప్రభుత్వం అతనిని గోల్డెన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్తో సత్కరించింది. NASA ఆమెకు స్పేస్ఫ్లైట్ మెడల్ను ప్రదానం చేసింది. అంతరిక్ష యాత్రల్లో గణనీయమైన సేవకు ఈ మెడల్ను అందిస్తుంది.